

న్యూస్ 24అవర్స్ టివి-పటాన్ చేరు, 06.02.2025: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారా నగర్లో ప్రభుత్వం డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేయడాని నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తాలో సమావేశమై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.

ప్యారానగర్ సర్వే నెంబర్ 40 & 41 లో నూతనంగా నిర్మిస్తున్న జిహెచ్ఎంసి డంపింగ్ యార్డు నిర్మాణం వెంటనే నిలిపి వేయాలని బి.ఆర్.ఏస్ పార్టీ తరుపున డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ సుజాత రాణి కి వినతి పత్రం అందచేసిన నర్సాపూర్ ఎమ్మేల్యే సునీత లక్ష్మ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, బి.ఆర్.ఏస్ రాష్ట్ర నాయకులు ఆదర్శ్ రెడ్డి, పటాన్ చేరు బిఆర్ఏస్ నియోజకవర్గ నాయకులు. అనంతరం వారు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్యారా నగర్ పరిసర ప్రాంతం సర్వే నెంబర్ 40 & 41 లో 750 ఎకరాల భూమిలోని 150 ఎకరాల మిగుల భూమిలో జిహెచ్ఎంసి డంపింగ్ యార్డు కేటియించడం జరిగింది.
కానీ అక్కడ రైతులు ఆ భూమి వారిది అని పంట సాగు చేస్తున్నామని వారి భూమి సర్వే చేసి సరిహద్దులు చూపాలని కోర్టు కు వెళ్ళి రిట్ పిటిషన్ నెంబర్ 35187/2024 ధాకలు చేయడం జరిగింది. స్టే ఆర్డర్ ఉన్నాక డంపింగ్ యార్డు పనులు ప్రారంభించడం కోర్టు ధిక్కారం అవుతుంది. కనుక పనులు వెంటనే నిలిపి వేయాలని కొరుతున్నాము. హైదరాబాదు లో సేకరించిన చెత్త మొత్తం ప్యారానగర్ కు తరలించి పచ్చని పొలాల మధ్య డంపింగ్ యార్డు పనులు ప్రారంభించడం బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రజా అభిప్రాయని వ్యతిరేకంగా మరియు కోర్టు స్టే ఆర్డర్ ఉన్నందున డంపింగ్ యార్డు నిర్మాణ పనులు వెంటేనే నిలిపివేయాలసిందిగా బిఆర్ఎస్ పార్టీ తరుపున కోరుచున్నము. రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ తరుపున భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి డంపింగ్ యార్డు నిర్మాణ పనులు ఆపే వరకు పోరాటం ఉదృతం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమం లో పటన్చేరు నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు తొంట అంజయ్య బాల్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, గోవర్దన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి రాజేష్, వివిధ పార్టీల అఖిలపక్ష నాయకులు, యువజన సంఘాల నాయకులు, మండలంలోని యువకులు, తదితరులు పాల్గొన్నారు.





