
న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్, 11.02.2025: తెలంగాణ రాష్టంలోనే 2వ అతిపెద్ద జాతర ఆయిన శ్రీ లింగ మంతుల స్వామి (పెద్దగట్ట) జాతర సందర్భంగా దురాజ్ పల్లి గుట్ట క్రింద పురపాలక సంఘము ఆధ్వరంలో రూ.167.30 లక్షల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులను చేయడం జరుగుతుందని మున్సిపల్ కమీషనర్ బోళ్ల శ్రీనివాస్ అన్నారు. మంగళ వారం రోజున గుట్ట ప్రాంతంలో జరుగు చున్న జంగిల్ క్లియరెన్స్, బారికేడింగ్, లైటింగ్, బాత్రుమ్స్ రిపేర్లు, కోనేరు పెయింటింగ్ రిపేర్లు,

తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, రోడ్ల పై గుంతలు పూడ్చుట, ప్యాచ్ వర్క్స్ పనులను పరిశీలించి నాణ్యత తో పనులను చేసి త్వరతగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ లను ఆదేశించారు. బాతురూమ్స్ వొద్ద మరియు నీటి సంపుల వొద్ద నీరు రోడ్ల మీదకు నీరు రాకుండా సంపులు ఎత్తు పెంచాలి అని మురికి నీరు వెళ్ళుటకు పైపు లైన్లు వేయాలి అని ఇంజనీర్లను ఆదేశించారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి జాతరకు వొచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.

గుట్ట చుట్టూ పారిశుద్ధ్య నిర్వహణ చేప్పట్టాలి అన్నారు. రెండేళ్ళకోసారి జరిగే ఈ జాతర ఈ నెల 16 నుండి జాతర ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇఇ యం. కిరణ్, డి.ఇ. సత్యారావు, శానిటరీ ఇన్స్ పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఏ.ఇ తిరుమలయ్య, రాజిరెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు యండి. గౌసుద్దీన్, ఎస్. ఎస్. ఆర్.ప్రసాద్, ఇండ్ల మనోజ్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ సురేష్, శివ ప్రసాద్ తదతరులు పాల్గొన్నారు.





