
న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి, 01.03.2025: ఎంపిపిఎస్ పాఠశాల తిరుమలగిరి నందు స్వపరిపాలన దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థినీ విద్యార్థులు విద్యాశాఖామంత్రిగా, ఎమ్మెల్యేగా, ఉపాధ్యాయులుగా , అధికారులుగా వివిధ పాత్రలలో చాలా చక్కగా అభినయం చేశారు. ముఖ్యంగా విద్యా శాఖా మాత్యులుగా పల్లిల్ తేజశ్రీ , శాసన సభ్యులు గా మురారిశెట్టి చరణ్ తేజ చాలా చక్కగా అభినయం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కసిరెడ్డి అశోక్ రెడ్డి, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు సిహెచ్. కవిత, కె. సత్యనారాయణ రెడ్డి, ఎన్. వెంకట్రామనర్సయ్య, బి. సౌమ్యబాయి, టి. రవీందర్ మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
5,991 Views




