

న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి, 01.03.2025: సూర్యాపేట జిల్లా కలెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారుల ఆదేశాల మేరకు తిరుమలగిరి మండలంలోని బండ్లపల్లి గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి సూర్యాపేట జిల్లా టీం లీడర్ పాలకుర్తి శ్రీకాంత్ కళా బృందంచే పరిసరాల పరిశుభ్రత, పాన్ మసాలా, గుట్కా, సారా నిషేధం పైన ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారధి కళాబృందం సభ్యులు. ఈర్ల సైదులు, గడ్డం ఉదయ్, వెన్నెల నాగరాజు, మాగి శంకర్, పాక ఉపేందర్, మేడిపల్లి వేణు, మద్దిరాల మంజుల, సిరిపంగి రాధ, నెమ్మాది స్రవంతి, పోతరాజు శిరీష, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
5,974 Views