న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి రూరల్, 04.03.2025: ఎస్.అర్.ఎస్.పి కాలువ ద్వారా వచ్చే నీటి సామర్థ్యాన్ని పెంచి ఎండిపోతున్న వరి పంట పొలాలను కాపాడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కంబాల శ్రీనివాస్. తిరుమలగిరి మండల మహాసభ కనుక అశోక్ అధ్యక్షతన మండలంలోని తొండ గ్రామంలో మంగళ వారం జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాస్ మాట్లాడుతూ పంటలకు పెట్టుబడి గణనీయంగా పెరిగిందని పంటల్ని కాపాడకపోతే రైతాంగానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లితుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ పంటల ప్రణాళికను అమలు చేయకపోవడం వలన అనేక రకాల ఇబ్బందులు రైతాంగం, ప్రజలు ఎదుర్కొంటున్నారని వ్యవసాయ శాఖ పంటల ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పంటల బీమా పథకం ఈ రాష్ట్రంలో అమలు కావటం లేదని, కేంద్రం ప్రవేశ పెట్టిన ఫసల్ బీమా యోజన సవరించి, పంటల బీమా బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం వలన రైతులకు న్యాయం జరుగుతుందని, కానీ కార్పొరేట్ బీమా కంపెనీలు కేవలం లాభాపేక్ష తప్ప సేవా దృక్పథం లేదని తెలిపారు. ఏలాంటి షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీని వెంటనే పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా రైతులు పంటలు వేసే ముందే వారి వారి ఖాతాలో జమ చేయాలని, యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా నేటికీ రైతుల ఖాతాలో వేయలేదని, తక్షణ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఐకెపి సెంటర్లో అమ్మకాలు చేసిన రైతాంగానికి నేటికీ జమ కాలేదని వెంటనే జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు ఎల్లంల యాదగిరి, తీపిరాల శ్రీకాంత్, రైతు సంఘం నాయకులు ఫయాజ్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఇక్బాల్, రైతు సంఘం నాయకులు సట్టు నరసయ్య, ఎల్లంల కొమరెల్లి, జంపాల మల్లయ్య, నాగులగాని మల్లయ్య, సుంచు సత్తయ్య, జంపాల శ్రీనివాస్, కుదురుపాక ఉప్పలయ్య, ఎల్లంల కొమరయ్య, పోరెల్ల వెంకన్న, ముత్యాల యాకన్న తదితరులు పాల్గొన్నారు.

6,001 Views
You Might Also Like
Leave a Comment
Follow US
Find US on Social Medias
Weekly Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
[mc4wp_form]
Popular News
- Advertisement -



Global Coronavirus Cases
Confirmed
0
Death
0
More Information:Covid-19 Statistics

