న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్, 18.03.2025: ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వం తెచ్చిన ఆన్ లైన్ లో సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం లో పంతంగి విలేకరులతో మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించేందుకు మున్సిపాలిటీ కార్యాలయాలకు వెళ్ళి పేమెంట్ చేసినా కూడా ప్రాసెస్ లో వుందని ఆన్ లైన్ లో చూపుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. అధికారులను అడిగితే సర్వర్ ప్రాబ్లం మూలంగా సమస్యలు తలెత్తుతున్నాయని చెప్తున్నట్లు పంతంగి పేర్కొంటూ చివరి తేదీని మరో మూడు నెలలు పొడిగించాలని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ చేసుకుంటేనే రిజిస్ట్రేషన్ అవుతుందని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అధికారులు చెబుతుండగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించినప్పటికీ ఆన్ లైన్ మాత్రం అండర్ ప్రాసెస్ అని సైట్ లో చూపుతుందన్నారు.

ఈ నెల 31 వరకు ఎల్ఆర్ఎస్ కు ప్రభుత్వం చివరి తేదీగా ప్రకటించిందని కానీ చివరి తేదీని మరో మూడు నెలల పాటు పొడగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2020 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లకు కూడా ఎల్ఆర్ఎస్ చేసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించాలని కోరారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సిబ్బందిని పెంచడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి ఖమ్మం పార్టీ అంజయ్య గౌడ్, పట్టేటి కిరణ్ పట్టణ గౌరవ సలహాదరుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, అయితేగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, సారగాండ్ల కోటేష్ తదితరులు పాల్గొన్నారు.





