
న్యూస్ 24అవర్స్ టివి-పటాన్ చెరువు, 27.03.2025: గుమ్మడిదల మండలం నల్లవల్లి ప్యారానగర్ లో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డంపింగ్ యార్డ్ వల్ల పర్యావరణ, ఆరోగ్యం సమస్యలు పెరుగుతాయి. వ్యవసాయంపై ఆధారపడి జీవంనం సాగిస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా గుమ్మడిదల మండల కేంద్రంలో మండల ప్రజలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 51 రోజుకు చేరుకుంది. రిలే నిరాహార దీక్షలో టెంట్ హౌస్ ఫ్రెండ్స్ దీక్షకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ చిమ్ముల జయపాల్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్ రాష్ట్ర రైతు సంఘాల సమైక్య మాజీ అధ్యక్షులు మంద బలరాంరెడ్డి, సిపిఐ నాయకులు దోమడుగు బాల్రెడ్డి, రైతు సంఘం అధ్యక్షులు సదానంద రెడ్డి మాజీ అధ్యక్షులు పోచుగారి మోహన్ రెడ్డి, దేవాలయ కమిటీ అధ్యక్షులు మద్దుల బాల్రెడ్డి, కాలకంటి రవీందర్ రెడ్డి, ముత్యాల రవీందర్ రెడ్డి, బుచ్చగారి బాల్రెడ్డి, ఆలేటి వెంకటరెడ్డి, జేఏసీ నాయకులు మంద భాస్కర్ రెడ్డి, ఎస్. జైపాల్ రెడ్డి, బుచ్చగారి రాంరెడ్డి, ఆంజనేయులు, చంద్రారెడ్డి, సాయి ప్రతాప్, సుధాకర్ రెడ్డి, రమణారెడ్డి, అంజి గౌడ్, యాదగిరి, అయూబ్, తుడుం రవి, బిక్షపతి రెడ్డి, శ్రీనివాస్, సత్యనారాయణ, నర్సింలు, యాదిరెడ్డి, లక్ష్మణ్ నాయకులు పాల్గొన్నారు.




