ఇటీవలికాలంలో సౌత్ డైరెక్టర్కు బాలీవుడ్లో మంచి డిమాండ్ ఏర్పడిన విషయం తెలుస్తుంది. సౌత్ నుంచి వెళ్లిన ఎన్నో సినిమాలు బాలీవుడ్లో బాక్సాఫీస్ని షేక్ చేశాయి. ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్టర్లంటే అక్కడ ఎంతో క్రేజ్ ఉంది. అయితే ఆ డైరెక్టర్ల లిస్ట్లో లేని ఓ టాలీవుడ్ డైరెక్టర్తో ఓ బాలీవుడ్ సంస్థ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అతనెవరో కాదు, రమేష్వర్మ.
బాలీవుడ్ అగ్ర నిర్మాణ పెన్ స్టూడియోతో కలిసి డీల్ కుదుర్చుకున్నారు రమేష్ వర్మ. ఈ సంస్థతో కలిసి మొత్తం 10 సినిమాలు చెయ్యాల్సి ఉండగా మొదటి విడతలో నాలుగు ప్రాజెక్టులు ఓకే అయ్యాయి. ఈ నాలుగు సినిమాల బడ్జెట్ సుమారు 150 కోట్ల రూపాయలు ఉంటుందని సూచిస్తుంది.
త మిళ స్టార్స్ విక్రమ్, ధ్రువ్, లారెన్స్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గణ్లతో ఈ నాలుగు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలకు సంబంధించిన కథలు కూడా ఫైనల్లో అయిపోయాయి. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ నాలుగు సినిమాల టైటిల్స్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తారు.
ఇదిలా ఉంటే.. దర్శకుడు రమేష్ వర్మ `కొక్కొరక్కో` అనే ఓ చిన్న సినిమా స్వీయ దర్శకత్వంలో రూపొందింది. సమ్మర్లో ఈ విడుదల కోసం సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన `కిల్` తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉంది.




