
ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్
పెళ్లిని అధికారికంగా ప్రకటించిన విజయ్, రష్మిక
ఉదయ్పూర్ కు పయనం
విజయ్ దేవరకొండ(విజయ్ దేవరకొండ), రష్మిక మందన్న(రష్మిక మందన్న) పెళ్లి గురించి కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరు ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో వివాహం చేసుకోబోతున్నారు. తాజాగా ఈ జాబితాలో విజయ్, రష్మిక అధికారికంగా ప్రకటించారు.
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో విజయ్, రష్మిక కలిసి నటించారు. అప్పటి నుంచి వీరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. నుంచి ఆ వార్తలు మరింత ఊపందుకున్నాయి.
న్యూస్ ని నిజం చేస్తూ.. విజయ్-రష్మిక నిశ్చితార్థం అక్టోబర్ లో జరిగింది. వివాహం 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో జరగనుంది. అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఈ విషయాలు ముందే బయటకు వచ్చేశాయి.

ఇక ఎట్టకేలకు విజయ్-రష్మిక తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించారు. ఈ జోడీని అభిమానులు ముద్దుగా విరోష్(VIROSH) అని పిలుస్తుంటారు. అందుకే తమ పెళ్లికి ‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్'(విరోష్ పెళ్లి) అని పేరు పెట్టినట్లు తెలుపుతూ.. ఇద్దరూ ఒకే సమయంలో ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టారు.
తాజాగా విజయ్, రష్మిక తమ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి ఉదయ్పూర్ కు పయనమయ్యారు. ఎయిర్ పోర్ట్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో విజయ్, రష్మిక ఒకే తరహా అవుట్ ఫిట్ తో కనిపించడం విశేషం.
కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుందట. ఆ తర్వాత హైదరాబాద్ లో జరగనున్న రిసెప్షన్ కి అందరినీ పిలవనున్నారని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: అదుర్స్-2 చేయడానికి ఎన్టీఆర్ రెడీనా?




