ఎంతో కాలంగా విజయ్ దేవరకొండ(విజయ్ దేవరకొండ), రష్మిక మందన్న(రష్మిక మందన్న)ల లవ్స్టోరీ మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయింది. ఫిబ్రవరి 26న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాంతో వారిపై వస్తున్న రూమర్స్కి తెరపడింది. తమపై ఎన్ని వార్తలు వస్తున్నా ఒక్కసారి కూడా స్పందించకుండా ఎంతో సంయమనం పాటించి తాము అనుకున్న విధంగా పెళ్లి చేసుకున్నారు. ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తను మొదటిసారి చూసినపుడు కలిగిన ఫీలింగ్ గురించి రష్మిక వివరించారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన తొలి సినిమా ‘గీతగోవిందం’. ఈ సినిమా షూటింగ్లో తొలిసారి విజయ్ని చూసి రష్మిక భయపడిందట. అంతముందు సంవత్సరమే ‘అర్జున్రెడ్డి’ సినిమా రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. ఆ సినిమాలో అతని గెటప్, క్యారెక్టర్ బిహేవ్ చేసే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. ఆ తరహా క్యారెక్టర్ చేసిన విజయ్.. వెంటనే ‘గీతగోవిందం’ చిత్రంలో అమాయకంగా ఉండే క్యారెక్టర్ చేశాడు.
‘అర్జున్రెడ్డి’ ప్రభావం రష్మికపై చాలా ఉండటంతో విజయ్ని మొదటిసారి చూసి భయపడింది. చిన్నతనం నుంచి కొత్త వ్యక్తులతో కలవాలన్నా, మాట్లాడాలన్నా రష్మికకు చాలా భయం. అందులోనూ అర్జున్రెడ్డి వంటి సినిమా చూసిన తర్వాత విజయ్తో మాట్లాడేందుకు ఎంతో బెరుకుగా అనిపించిందట. చేసిన క్యారెక్టర్కి, నిజ జీవితంలో కనిపించే వ్యక్తికి సంబంధం ఉండదు అనే విషయం నటిగా రష్మికకు తెలిసినప్పటికీ భయం మాత్రం పోలేదట.
ఒక్కసారి విజయ్తో మాట్లాడిన తర్వాత ఆమె భయం పటాపంచలైపోయింది. ఎందుకంటే విజయ్ ఎవరితోనైనా ఎంత మర్యాదగా మాట్లాడతాడనే విషయం అందరికీ తెలుసు. రష్మికతో కూడా ఎంతో కూల్గా మాట్లాడడంతో ఆమె మనసు కుదుటపడింది. అతను సెట్లో ఉంటే వాతావరణం పాజిటివ్గా ఉంటుందని చెప్పింది. అతని కోఆపరేషన్ వల్ల తాము కలిసి నటించే సీన్స్ ఎంతో అద్భుతంగా వచ్చాయని, షూటింగ్ అంతా ఎంతో సాఫీగా సాగిపోయిందని విజయ్తో తన తొలి పరిచయం గురించి రష్మిక మందన్న వివరించారు.




