న్యూస్ 24అవర్స్ టివి-హైదరాబాద్,08.03.2025: సూర్యాపేట జిల్లా కార్మికులు ఎదురు చూస్తున్న ఈఎస్ఐసీ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ESIC డిస్పెన్సరీ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. హనుమకొండ, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట జిల్లాలో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. రాష్ట్రంలో కొత్తగా 20 డిస్పెన్సరీలు అవసరమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాక ఆర్థిక శాఖ అనుమతితో త్వరలో జీవో జారీ కానుంది.
5,946 Views




