న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి టౌన్, 12.03.2025: తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రతి సీజన్లో అత్యధిక ధాన్యం ప్రతిరోజు వస్తుందని గతంలో మార్కెట్ యార్డులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి స్థలం కేటాయించారని, ఆ కేటాయింపులను రద్దుచేసి ఆ షెడ్డు ని మార్కెట్ అవసరాలకు ఉపయోగిస్తామని తిరుమలగిరి మార్కెట్ చైర్మన్ ఎల్సోజు చామంతి నరేష్ అన్నారు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు సహకారంతో ఆ స్థలంలో రైతులకు ఉపయోగపడే విధంగా షెడ్లు, భవనాల నిర్మిస్తామని ఆమె చెప్పారు. బుధవారం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని అన్ని షెడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ మాట్లాడుతూ సీజన్లో ప్రతిరోజు మార్కెట్ యార్డ్ కు 30 వేల నుండి 50వేల బస్తాల ధాన్యం రావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. మార్కెట్ యార్డులో ఇంటి గ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తే ఇటు రైతులు, అటు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతారని తెలిపారు. అవసరమనుకుంటే ఇంటి గ్రేటెడ్ మార్కెటు ను వేరే స్థలంలో నిర్మించడానికి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. మార్కెట్ యాడ్లో రైతులకు అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. మార్కెట్కు వచ్చిన ప్రతి ధాన్యం గింజకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూస్తామని తెలిపారు. మార్కెట్ యార్డ్ లోకి కోతులు మేకలు రాకుండా చుట్టూ సోలార్ పెన్సింగ్ నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లు రాపాక సోమేష్, గాదరబోయిన ఉప్పలయ్య, మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి అనిల్, అబ్బాస్, సుధాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

5,981 Views
You Might Also Like
Leave a Comment
Follow US
Find US on Social Medias
Weekly Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
[mc4wp_form]
Popular News
- Advertisement -



Global Coronavirus Cases
Confirmed
0
Death
0
More Information:Covid-19 Statistics

