న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్, 17.03.2025: సూర్యాపేట లో ఐటి హబ్ ఇండస్ట్రియల్ పార్కులు పునరుద్ధరించాలి. సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ *అధ్యక్షులు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఐటీ హబ్ ఇండస్ట్రియల్ పార్కులు తిరిగి పునరుద్ధరించాలని ఆయన అన్నారు. సూర్యాపేట జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. జిల్లా అభివృద్ధికి అధికారులు సహకరించాలని ఆయన అన్నారు. ఐటీ హాబ్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం పాత కలెక్టరేట్ కార్యాలయంలో ఐటి హబ్ ను ఎన్నికలకు ముందు లాంచనంగా ప్రారంభించింది ఎన్నికలలో ప్రభుత్వం మారడంతో నూతన ప్రభుత్వానికి ప్రాధమ్యాలు మారిపోవడంతో ఐటి హబ్ పూర్తిగా గాలికి వదిలేసినట్లయింది. నిజానికి ఐటీ హబ్ ఏర్పాటు చేయడానికి రెండేళ్ల కృషి ఉంది అందులో యూఎస్ లో ఉన్న అనేక కంపెనీలను సూర్యాపేటలో పెట్టడానికి ఒప్పించడం వాటిలో దాదాపు దాదాపు10 కంపెనీలు ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం అంగీకరించడం తో ఐటీ హబ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సెంటీఫోర్స్ సంస్థ నిర్వాహకులు రజనీకాంతు సంఘాని ఐటీ హబ్ కోసం తీవ్రంగా ప్రయత్నించి ఓ మేరకు విజయం సూర్యాపేట సమీపంలో ఉన్న బాల్యంలో గ్రామానికి చెందిన రజనీకాంత్ సూర్యాపేటకు తన వంతుగా ఏదైనా ఒక నిర్మాణాత్మక కార్యక్రమంనీ సాధించాలని ఐటి హబ్ ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం మారడంతో విస్మయానికి గురి అయ్యారు ఇటీవల అమెరికా టూర్ లో రజనీకాంత్ సూర్యాపేటలో ఐటి హబ్ తిరిగి ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కూడా విన్నవించుకున్నాడు. తిరిగి ముఖ్యమంత్రి గారు కూడా త్వరలో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కావున దాన్ని తిరిగి పునర్ ప్రారంభించాలని సూర్యాపేట జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. త్వరలో ఆ కోరిక నెరవేరాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. కోసంపెట్టడం పెట్టుబడి పెట్టడానికికలెక్టరేధరణి వెబ్సైట్లో పాత డిజిటల్ యాప్ ను తీసేశారు. అలా తీయడం వల్ల సర్టిఫై కాపీలు ఆన్లైన్లో రావట్లేదు. అవి బ్యాంకు లోన్ గాని వ్యక్తిగత పనులకు గాని అవసరం ఉంటది. ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. ఫ్లాట్లకు పది వేలు కట్టిన ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి ఆన్లైన్లో ఆప్షన్ తీసుకోవట్లేదు. అని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. మున్సిపల్ కార్యాలయం ద్వారా గతంలో ఇంటి నెంబర్ ఇచ్చి అధికారులు ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో రిజిస్ట్రేషన్లు కాక యజమానులు ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. అన్నారు. అధికారులు స్పందించి ఆ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం కోసం కృష్ణానగర్లో గతంలోనే 8 గుంటల స్థలాన్ని గుర్తించారని ,భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి అన్ని మౌలిక వస్తువులు కల్పించి నిర్మాణం చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి ఖమ్మం పార్టీ అంజయ్య గౌడ్ పట్టేటి కిరణ్ పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి పట్టణ ఉపాధ్యక్షుడు బానోతు జానీ నాయక్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేటలో ఐటీ హబ్ ఇండస్ట్రియల్ పార్కులు పునరుద్ధరించాలి: పంతంగి వీరస్వామి గౌడ్
5,958 Views
You Might Also Like
Leave a Comment
Follow US
Find US on Social Medias
Weekly Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
[mc4wp_form]
Popular News
- Advertisement -



Global Coronavirus Cases
Confirmed
0
Death
0
More Information:Covid-19 Statistics

