న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి టౌన్, 18.03.2025: తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 67 వ వార్షికోత్సవం సందర్భంగా పాఠశాల యొక్క ప్రారంభం, ప్రస్థానాలను, గురించి సంక్షిప్తంగా చెప్పుకోవడం సందర్భ చిరంగా ఉంటుంది. ఆధారాలను బట్టి ఈ పాఠశాల 1937 సం11లో ఉర్దూ మీడియంలో ఆరంభించబడి, కాలక్రమేణా తెలుగు మీడియం పాఠశాలగా స్థిర పడింది. 1958 నుండి ఒక్కో తరగతి అస్ప్రెడ్ చేయబడుతూ, ఎచ్ ఎస్ కో ఏర్పాటు చేయడం జరిగింది. ఆతర్వాత ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి 10+2లో భాగంగా ఎస్సీసి గా మార్చారు. 1969 నుండి ఎసెసి గా ప్రారంభమైంది. భౌగళికంగా ఈ పాఠశాల సర్వేనెం : 386 లో, 5, 760 – చ మిమీ ల విస్తీర్ణంలో ఉంది. “ఇంతింతై, వటుడింతై అన్న చందంగా, దినదిన ప్రవర్ధమానమగుచూ, అధునాతనమైన వస, సౌకర్యాలతో, ఒకు కదుల ఎకారభవనం, ఆడిటోరియం, విశాలమైన క్రీడామైదానం, లాంజ్ లైబ్రరి, మినరల్ వాటర్ ప్లాంట్, గుచ్చని చెట్ల మధ్య అన్ని రకాల పరియాలలో అలలారుతుంది. ఆంగ్ల మధ్యమంలో కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానంతో ఎల్ ఈ డి మీరం పై అనుతరజ్ఞులు, అంకితభావం గల ఉపాధ్యాయులతో బోధన జరుగుతుంది. ఈ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల, నట్స్, స్టడీ మెటీరియా యూనిఫాం, మధ్యాహ్నభోజనం, అందిస్తూ, ఉన్నాల్ విద్యా ప్రగతిని సాధిస్తూ, ఉత్తమ ఫలితలతో ముందుకు సాగుతోన్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు చోరవ తీసుకొని వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీగే రచయిత అభినయ శ్రీనివాస్ హాజరై విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి లక్ష్యసాధన చేయాలని అన్నారు.
మండల విద్యాధికారి ఐ. శాంతయ్య విద్యార్థులకు బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాల అధిరోహించాలని దీవించారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజ మోహన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు బాగా కష్టపడి చదివి పరీక్షలు మంచిగా రాయాలని ఆశీర్వదించారు. సందర్భంగా తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఏల్స జు చామంతి నరేష్ స్కూల్ అభివృద్ధికి గాను పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ తమవంతుగా కృషి చేయాలని అన్నారు విద్యార్థుల అభివృద్ధితో పాటు వారు ఉన్నత చదువులలో అత్యధిక మార్కులు సాధించేందుకు ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులు సహాయ సహకారాలు అందించాలని కోరారు విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలకు పేరు తీసుకురావడానికి కష్టపడి చదివి త్వరలో జరగనున్న పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి తిరుమలగిరి ఉన్నత పాఠశాలను జిల్లా స్థాయిలోనే గుర్తింపు తీసుకురావాలని కోరారు.

ఘనంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం
5,985 Views
Leave a Comment



