
న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి, 26.03.2025: సాంబశివుడు, రాములన్న అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారి పరమేష్ ఆధ్వర్యంలో తిరుమలగిరి మండల కేంద్రములో 14వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా చిత్రపటానికి నివాళులర్పించారు. సాంబశివుడు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే నిర్వహించాలని అదేవిధంగా ట్యాంక్ బండి పై సాంబశివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి కొత్తగట్టు మల్లయ్య, ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు కందుకూరు సోమన్న మాదిగ, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంబాబు, కడెం మల్లయ్య, మార్కెట్ డైరెక్టర్ గాదర బోయిన ఉప్పలయ్య, పయ్యంలా వెంకన్న, కందుకూరు ప్రవీణ్, కందుకూరు శ్రీను, వేల్పుల కిరణ్, కన్నెబోయిన నాగరాజు, సోమయ్య, యాదగిరి, కొండయ్య, కిరణ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.




