Sugarcane field Fire Accident : సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం, 50 ఎకరాల్లో చెరుకు పంట కాలిబూడిద
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
మంగళ, 21 జనవరి 202505:07 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Sugarcane field Fire Accident : సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం, 50 ఎకరాల్లో చెరుకు పంట కాలిబూడిద
Sugarcane field Fire Accident : సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 50 ఎకరాల్లో చెరుకు తోట దగ్దం అయ్యింది. చెరుకు తోటల మీదుగా వెళ్తున్న కరెంటు తీగలు, ఒకదానికి ఒకటి తగలడంతో, నిప్పులు చెరుకు పంటలో పడ్డాయని రైతులు తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి
మంగళ, 21 జనవరి 202504:38 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Janasena : జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు, గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్
Janasena : జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. దీంతో గాజు గ్లాస్ సింబల్ ను ఇకపై జనసేనకు మాత్రమే కేటాయించనున్నారు. ఈ మేరకు ఈసీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లేఖ రాసింది.
పూర్తి స్టోరీ చదవండి
మంగళ, 21 జనవరి 202503:22 PM IST
ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ లైవ్: సత్యసాయి క్రైమ్ : ఇంటిపక్క వ్యక్తితో వివాహేతర సంబంధం, ప్రియుడితో కలిసి భర్త హతమార్చిన భార్య
Satyasai Crime : సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. ఇంటిపక్కనే కూరగాయలమ్మే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ…ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి
మంగళ, 21 జనవరి 202502:51 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Kakinada Port : కాకినాడ పోర్టు వివాదం కొలిక్కి-కేవీరావు,అరబిందో మధ్య కుదిరిన రాజీ!
కాకినాడ పోర్ట్ : కాకినాడ పోర్టు వివాదంలో కేవీరావు, అరబిందో మధ్య రాజీ కుదిరింది. కేవీరావుకు కాకినాడ పోర్టుకు సంబంధించిన వాటాలను అరబిందో తిరిగి ఇచ్చేసింది. కాకినాడ సెజ్ అరబిందో వశమైంది.
పూర్తి స్టోరీ చదవండి
మంగళ, 21 జనవరి 202501:23 PM IST
ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ లైవ్: AP మద్యం దుకాణాలు : గీతకార్మికులకు 335 మద్యం షాపులు, నోటిఫికేషన్ విడుదల
AP Liquor Shops : ఏపీలో మరోసారి మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. గీత కార్మికులకు 335 మద్యం షాపులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. జిల్లాల వారిగా దరఖాస్తులు ఆహ్వానించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీసి రెండేళ్ల కాలానికి లైసెన్సులు జారీ చేయనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి
మంగళ, 21 జనవరి 202512:29 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Janasena : డిప్యూటీ అంశంపై ఎవరూ స్పందించవద్దు, జనసేన అధిష్టానం కీలక ఆదేశాలు
జనసేన : ఏపీలో డిప్యూటీ సీఎం అంశంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన నేతలు డిప్యూటీ సీఎం, సీఎం పదవులపై బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధిష్టానం స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి
మంగళ, 21 జనవరి 202510:22 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Anantapur DRO : కలెక్టరేట్ లో కీలక సమావేశం, ఆన్ లైన్ లో రమ్మీ ఆడుకుంటున్న అధికారి-వీడియో వైరల్
అనంతపురం డీఆర్వో : ఒకవైపు ఎస్సీ వర్గీకరణపై కీలక సమావేశం…ఓ ఆపరేటింగ్ అధికారి సెల్ ఫోన్లో పేకాట అడుతూ మీడియా కెమెరాకు చిక్కారు. అధికారి నిర్వాకం వైరల్ కావడంతో కలెక్టర్ విచారణ చేపట్టారు.
పూర్తి స్టోరీ చదవండి
మంగళ, 21 జనవరి 202509:53 AM IST
ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ లైవ్: చిత్తూరు : జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంట.. ఆంధ్రా జవాను మృతి.. ప్రముఖుల సంతాపం
- చిత్తూరు: జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. ఏపీకి చెందిన జవాన్ మృతి చెందారు. జవాన్ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. ఇవాళ (మంగళవారం) రాత్రి వరకు మృతదేహం గ్రామానికి చేరుకోవడాన్ని స్థానికులు చెబుతున్నారు. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సహా.. పలువురు సంతాపం తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి
మంగళ, 21 జనవరి 202506:28 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Chiranjeevi Re Entry : బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడ.. మళ్లీ రాజ్యసభకు అన్నయ్య! కారణం ఇదేనా?
- Chiranjeevi Re Entry : మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. 2009కి ముందు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చిరు.. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. కొన్నాళ్లు కేంద్రమంత్రిగా పనిచేశారు. మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టారు. తాజాగా ఆయనను రాజ్యసభకు పంపిస్తారనే చర్చ నడుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి
మంగళ, 21 జనవరి 202505:41 AM IST
ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ లైవ్: US పౌరసత్వ నియమాలు: ట్రంప్ ప్రభావం.. యూఎస్ పౌరసత్వ నిబంధనలు కఠినతరం…అమెరికాలో పుట్టినా ఇక కష్టమే..
- US పౌరసత్వ నియమాలు: అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక సంస్కరణలు చేసింది. అమెరికా పౌరసత్వ నిబంధనల్లో కీలక మార్పులు చేపడుతూ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. తాజా నిర్ణయంతో ఇకపై అమెరికా పౌరసత్వం లభించడం మరింత ఆకర్షణీయం.
పూర్తి స్టోరీ చదవండి
మంగళ, 21 జనవరి 202505:03 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Aadhaar Camps : చిన్నారుల కోసం ప్రత్యేక ఆధార్ క్యాంపులు.. ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!
- AP ఆధార్ క్యాంపులు : చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. రెండు విడతలుగా నిర్వహించే ఈ క్యాంపులు.. నేటి నుంచి జనవరి 24 నుండి మొదటి విడతగా జరుగుతాయి. రెండో విడతగా జనవరి 27 నుంచి జనవరి 30 వరకు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి
మంగళ, 21 జనవరి 202505:02 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Visakha Fire Accident: విశాఖ పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
- విశాఖ: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రోకెన్ ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మాసిటీలో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి
మంగళ, 21 జనవరి 202504:09 AM IST
ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ లైవ్: TTD దర్శన్ టిక్కెట్లు: నేడు టీటీడీ ఏప్రిల్ నెల కోటా ఆర్జిత సేవల టిక్కెట్లు విడుదల, ఆన్లైన్లో ఎంపిక..
- తిరుమల దర్శనం టిక్కెట్లు : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు ఏప్రిల్ నెల కోటా టిక్కెట్లు నేడు విడుదల కానున్నాయి. ఆర్జిత సేవల్లో సుప్రభాతం, తోమ’ల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ 2025 ఏప్రిల్ నెల కోట నేడు ఆన్లైన్లో విడుదల చేయబడుతుంది.
పూర్తి స్టోరీ చదవండి
మంగళ, 21 జనవరి 202503:13 AM IST
ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ లైవ్: AP Whatsapp సర్టిఫికెట్లు: వాట్సాప్లో పౌరసేవలు..త్వరలో తెనాలిలో ప్రారంభం, సమాచార గోప్యతపై సీపీఎం ఆందోళన..
- AP Whatsapp సర్టిఫికెట్లు: ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో వాట్సాప్లోనే పౌర సేవలు అందనున్నాయి. తెనాలిలో ప్రయోగాత్మకంగా వాట్సాప్ సేవల్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. మరోవైపు ప్రభుత్వ తీరుపై గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవ నిర్వాహకుల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి
మంగళ, 21 జనవరి 202502:10 AM IST
ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ లైవ్: చంద్రబాబు దావోస్ పర్యటన: ఉత్సాహంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన.. తొలిరోజు పెట్టుబడిదారులతో వరుస సమావేశాలు
- చంద్రబాబు దావోస్ టూర్: వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తొలిరోజు పర్యటనలో వరుసగా పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. జ్యూరిచ్లోని హిల్టన్ హోటల్లో భారత అంబాసిడర్ మృధుల్ కుమార్తో సమావేశమయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి
మంగళ, 21 జనవరి 202512:27 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Dy CM Demand: లోకేష్కు డిప్యూటీ సీఎం డిమాండ్ వెనుక అసలు కారణాలు ఏమిటి? కూటమిలో ఏం జరుగుతోంది?
- Dy CM డిమాండ్: ఏపీలో కూటమి ప్రభుత్వం సరిగ్గా ఆర్నెల్లు నిండాయి. ఇప్పుడిప్పుడే పాలనపై ప్రభుత్వం పట్టు సాధిస్తోంది. ఈ అనూహ్యంగా నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ను టీడీపీ నేతలు తెరపైకి తెచ్చారు. సమయం, సందర్భం లేకుండా టీడీపీ నేతల డిమాండ్ వెనుక కారణాలు ఏమిటి.
పూర్తి స్టోరీ చదవండి




