[ad_1]

సూపర్ స్టార్ మహేష్ బాబు (మహేష్ బాబు), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS రాజమౌళి) కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘వారణాసి’ (వారణాసి). ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి కేవలం తెలుగులోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్-వరల్డ్ ప్రాజెక్ట్గా రూపొందించబడిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే, తాజాగా ఈ విషయంలో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
దేవర సెట్స్లో వారణాసి షూటింగ్!
జూనియర్ ఎన్టీఆర్)నటించిన ‘దేవర’ సినిమా కోసం హైదరాబాద్లో భారీ సెట్లు వేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్, సముద్రపు నేపథ్యంలో సాగే సీన్ల కోసం ప్రత్యేకంగా భారీ వాటర్ ట్యాంక్ సెట్లను నిర్మించారు. ఇప్పుడు అదే సెట్స్ను రాజమౌళి తన ‘వారణాసి’ సినిమా కోసం వాడుకుంటున్నట్లు సమాచారం. గంగా నది యాక్షన్ సాగే కొన్ని కీలకమైన సీక్వెన్స్ లను ఈ వాటర్ సెట్లో చిత్రీకరిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
విదేశీ ప్లాన్స్ రద్దు.. హైదరాబాద్లోనే చిత్రీకరణ
వాస్తవానికి ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీన్లను విదేశాల్లో చిత్రీకరించాలని రాజమౌళి భావించారు. అయితే, ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా విదేశీ షెడ్యూల్స్ను రద్దు చేసినట్లు తెలుస్తోంది. రాజమౌళి తన ప్లాన్ మార్చుకుని, హైదరాబాద్లోని స్థానాల్లోనే ఆ సన్నివేశాలను పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ‘దేవర’ సినిమా కోసం వేసిన అండర్ వాటర్ సెట్ ‘వారణాసి’ టీమ్కు వరంగా మారింది.
మహేష్ బాబు నయా లుక్.. భారీ యాక్షన్ సీక్వెన్స్
ఈ సినిమాలో మహేష్ బాబు మునుపెన్నడూ చూడని సరికొత్త గెటప్లో కనిపించనున్నారు. రాజమౌళి మార్క్ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ బాబుపై భారీ రివర్ ఛేజ్ (నదిలో ఛేజ్) సీక్వెన్స్లను ప్లాన్ చేశారు. ‘దేవర’ సెట్స్లో జరుగుతున్న ఈ షూటింగ్లో మహేష్ పాల్గొంటున్నారు, అక్కడ చిత్రీకరిస్తున్న విజువల్స్ వెండితెరపై అద్భుతంగా రానున్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
కె.ఎల్.నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మాణం ‘వారణాసి’ సినిమా ఏప్రిల్ 7, 2027న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు.
[ad_2]




