[ad_1]

రెండు తెలుగు రాష్టాల్లో మాములు సౌకర్యాలతో థియేటర్లు ఉన్న రోజుల్లోనే నెల్లూరు(నెల్లూరు)లో థియేటర్లు అధునాతన హంగులతో ఉండేవి. దేవతలు సైతం సినిమా చూడాలని అనుకుంటే నెల్లూరులో వాలిపోయే వాళ్ళు అనే సామెత కూడా బలంగానే ఉండేది. అన్ని సౌకర్యాలతో సౌండ్ సిస్ తో ఉండేవి. ఇప్పుడు ఆ ఆనవాయితిని కంటిన్యూ చేస్తూ మరో సరికొత్త ప్రపంచానికి నెల్లూరు నాంది పలుకుతుంది.
నెల్లూరు నగరంలో ‘లీలా మహల్'(లీలా మహల్)సెంటర్ అంటే తెలియని వారు ఉండరు. ఆ పేరు ఆ పేరు రావడానికి కారణమైన చారిత్రక లీలా మహల్ థియేటర్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. సుమారు 75 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ థియేటర్, మారుతున్న కాలానికి అనుగుణంగా గత మూడు ఏళ్లుగా మూతపడి ఉంది. అయితే, ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అత్యంత విలాసవంతమైన హంగులతో ముస్తాబై మే 14, 2026 (నేడు) ప్రేక్షకులకు స్వాగతం పలికింది.సరికొత్త టెక్నాలజీ మరియు విలాసవంతమైన సౌకర్యాలతో నిర్వాహకులు పునర్నిర్మించారు. నేటి తరం ప్రేక్షకులకు మల్టీప్లెక్స్ అనుభూతిని అందిస్తుంది సింగిల్ స్క్రీన్ థియేటర్లోనే అద్భుతమైన మార్పులు చేశారు.
వెండితెరపై మాయాజాలాన్ని ప్రదర్శించేందుకు అత్యాధునిక బార్కో 4K లేజర్ ప్రొజెక్షన్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల చిత్రం అత్యంత స్పష్టంగా, వర్ణరంజితంగా కనిపిస్తుంది. ఆడియో పరంగా ఎక్కడా రాజీ పడకుండా Dolby Atmos సరౌండ్ సౌండ్ సిస్టమ్ని అమర్చారు. ప్రేక్షకులకి సినిమా చూస్తున్నప్పుడు ఒక రియలిస్టిక్ ఫీల్ను కలిగిస్తుంది. థియేటర్ లోపల రాజసం ఉట్టిపడేలా ఇంటిరియర్ డిజైన్ చేశారు. ముఖ్యంగా లగ్జరీ రిక్లైనర్లు మరియు కుషనింగ్ సీట్లను ఏర్పాటు చేసి, హాయిగా సినిమా చూసే సౌకర్యాన్ని కల్పించారు. టికెట్ ధరలు మరియు మొదటి చిత్రం పునఃప్రారంభం తర్వాత ఈ థియేటర్లో ప్రదర్శించబడుతున్న మొదటి సూర్య నుంచి వచ్చిన తాజా సినిమా వీరభద్రుడు. రోజుకు ఐదు షోల ప్రదర్శనకు అధికారులు అనుమతి ఇచ్చారు. టికెట్ ధరని సామాన్యులకి అందుబాటులో ఉండేలా 250 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించారు. కాకపోతే ఈ రోజు వీరభద్రుడు ఇంకా సెల్యులాయిడ్ పై కాలుమోపలేదు.సాయంత్రం ఆరు గంటల షో నుంచైనా పడుతుందేమో చూడాలి.
ఏది ఏమైనా నెల్లూరు వాసుల సెంటిమెంట్తో ముడిపడి ఉన్న లీలా మహల్ థియేటర్ మళ్ళీ అక్కడకు రావడం సినీ ప్రియులకు పెద్ద పండగ లాంటిదే. ఓటీటీల హవా ఈ కాలంలో, ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించాలంటే ఇలాంటి అత్యాధునిక సాంకేతికత ఎంతో అవసరం. నెల్లూరు నగరంలో ఉత్తమ సినిమా అనుభూతిని అందించే కేంద్రంగా లీలా మహల్ నిలుస్తుందనడంలో సందేహం లేదు. పైగా అన్ని రకాల సౌకర్యాలు కలిపిస్తున్న ఏకైక సింగిల్ స్క్రీన్ రెండు తెలుగు రాష్టాల్లో లీలా మహల్ అని చెప్పవచ్చు.
[ad_2]




