
న్యూస్ 24అవర్స్ టివి-పటాన్ చెరు, 11.02.2025: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి ప్యారా నగర్ గ్రామాలలో ప్రభుత్వం డంపు యార్డ్ ఏర్పాటు చేయాలని స్థలం సిద్ధం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ పచ్చటి పంట చేనుల మధ్య, చెట్ల మధ్య డంప్ యార్డ్ మాకొద్దు అంటూ భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటామని ధర్నా చేస్తున్న సంగతి తెలిసిన విషయమే. ఏడవ రోజు ఈ యొక్క సమ్మెకు రైతు సంఘాలు మద్దతు పలికారు. గుమ్మడిదల మండలంలోని మహిళా సంఘాలు, యువజన సంఘాలు, కుల సంఘాలు అన్ని ఏకమై సమ్మెలో పాల్గొంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం పట్టించుకోని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి డంపు యార్డును తీసివేయాలని ప్రజల కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గుమ్మడిదల అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, హుస్సేన్ షరీఫ్ చాపల మధు, బొడ్డు రాజశేఖర్, పెద్దంగాల మహేష్ లతో పాటుగా గుమ్మడిదల మండల బొంతపల్లి గ్రామ నాయకులు చక్రపాణి తమ సంఘీభావం తెలుపుతూ మాకున్న స్నేహపూర్వక అనుభంధంతో వారు కూడా రిలే నిరాహారదీక్ష లో పాల్గొన్నారు.




