న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట/తిరుమలగిరి, 12.02.2025: సూర్యాపేట జిల్లాలోని నాగారం, జాజిరెడ్డి గూడెం (అర్వపల్లి), తిరుమలగిరి, తుంగతుర్తి మండల కేంద్రాలలోని మీసేవ కేంద్రాలను ఈడిఎం గఫర్ ఈ రోజు ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రేషన్ కార్డులో భాగంగా తనిఖీని నిర్వహిస్తున్నానని అన్నారు. నూతన రేషన్ కార్డులో భాగంగా ప్రజా పాలన గ్రామ సభలు రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను కుటుంబ సభ్యుల చేరికలను దరఖాస్తులను స్వీకరించిందని

ఇంకా తమ పేర్లను నమోదు చేసుకోని వారు, ప్రస్తుతం రేషన్ కార్డు లేని వారు తమ కుటుంబీకుల పేర్లను నమోదు చేసుకోవడం వంటి మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ దరఖాస్తు చేసుకునేవారు ప్రజాపాలన గ్రామసభలో దరఖాస్తు చేసుకోని వారు మాత్రమే చేసుకోవాలన్నారు. సూచనలను, సలహలను అందజేశారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరను మాత్రమే దరఖాస్తుదారుల నుండి మీసేవ వారు తీసుకోవాలన్నారు. తప్పనిసరిగా మీసేవ కేంద్రంలో ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలిగే విధంగా ఉండకూడదని అన్నారు. ఏ విధమైన కంప్లైంట్ వచ్చిన చర్యలు తీసుకుంటామని సూచించారు. మీసేవ ఓనర్స్ సత్యనారాయణ, మల్లికార్జున్, సైదులు, వెంకన్న, సాయి, జ్యోతి, గ్రామస్తులు ఉన్నారు.





