1985లో నారపల్లి, కొర్రెముల గ్రామాల్లో పేదవారు కంచెలు, జంగల్ భూములు కొనుక్కుని ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. 149 ఎకరాలు దొంగ కాగితాలు సృష్టించి అమ్ముకుంటున్నారని. అధికారులకు, కలెక్టర్ కు, సీపీకి, మంత్రికి, సీఎంకు ఇక్కడ పరిస్థితులపై ఉత్తరాలు రాస్తానన్నారు. తప్పు కొనుక్కున్న వారిది కాదు.. దొంగ కాగితాలు చేసిన అధికారులది, వాళ్లని జైల్లో పెట్టాలనుకుంటున్నారు. ఎవరైనా పేదల మీద దౌర్జన్యం చేస్తే ఖబడ్దార్ అని ఈటల హెచ్చరిక. చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తే పాలన సులభం అవుతుంది, కలెక్టర్లు అక్కడ ఉంటారని అనుకున్నామని, కానీ కలెక్టర్లు దొరకడం లేదు. పోలీస్ కమిషనర్ కు ఎంపీని కలవడానికి సమయం ఉండదు కానీ బ్రోకర్లను కలవడానికి మాత్రం సమయం ఉంటుంది.
6,015 Views




