
న్యూస్ 24అవర్స్ టివి-మోతే, 10.02.2025: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గా ఇటీవల జరిగిన సిపిఎం పార్టీ రాష్ట్ర నాలుగో మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నికైన జాన్ వెస్లీని హైదరాబాద్ లోని మాకినేని పున్నయ్య భవన్ లో సోమవారం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు మర్యాదపూర్వకంగా జాన్ వెస్లీనికలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మట్టిపల్లి సైదులు మాట్లాడుతూ జాన్ వెస్లీ నాయకత్వంలో రాష్ట్రంలో సిపిఎం బలమైన పార్టీగా అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. ఆయన వెంట సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యురాలు జంపాల స్వరాజ్యం ఉన్నారు.


