న్యూస్ 24అవర్స్ టివి-అనంతపురం, 02.03.2025: రంజాన్ మాసం సందర్బంగా కొంత మంది కమ్యూనిటీ పెద్దల విజ్ఞప్తి మేరకు ఈ రోజు నుండి రాత్రి పూట 10 గంటల వరకు కాకుండా రంజాన్ ఉపవాసాలకు సంబంధించిన షాపులకు అదనంగా మరో గంట అనగా రాత్రి 11 గంటల వరకు మినహాయింపు ఇవ్వడము జరిగిందని కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ తెలిపారు. 11 గంటల తర్వాత ఎవరికీ ఎటువంటి మినహాయింపు ఉండదు. దీనినీ అడ్డు పెట్టుకొని కొంత మంది పిల్లలు బజార్ల యందు అనవసరంగా తిరుగుతున్నా, ఎక్కడైనా మోటార్ సైకిల్ వీలింగ్ చేసిన లేదా పండుగకు సంబంధము లేని షాపులు రాత్రి 10 గంటల తర్వాత అలాగే తెరిచి ఉంచిన అలాంటి వారిపై తగిన చర్య తీసుకోవడమే కాకుండా కేసులు కూడా రిజిస్టర్ చేయడము జరుగుతుంది. అలాగే భద్రతా కారణముల రీత్యా టౌన్ నందు రాత్రి పూట రెండు బీట్లు మరియు రెండు మొబైల్స్ గస్తీ నిమిత్తము ఏర్పాటు చేయడము జరిగింది.


