న్యూస్ 24అవర్స్ టివి-విజయవాడ, 03.03.2025: ఎన్.టి.ఆర్ జిల్లా చిల్లకల్లు లోని డా. గోరంట్ల శ్రీనివాసరావు స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ నాయకులు గోరంట్ల శ్రీనివాసరావు ను ఘనంగా సన్మానించి, అతని సేవలు కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ బీసీల్లో అత్యంత వెనకబడ్డ డిఎన్టి కులాల కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ స్థాయికి రావటం నిజంగా మనందరికీ గర్వకారణం అని కొనియాడుతూ ఇంకా అనేకమైన అవార్డులు పొందుతూ అందరికీ సేవ చేయాలని వక్తలు వారి సంతోషాన్ని తెలియజేశారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని డాక్టర్ గోరంట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ నా లక్ష్యం ఇది కాదు, రాజ్యాంగపరంగా రావలసిన మన హక్కులు సంచార కులాలకు 12 శాతం రిజర్వేషన్ సాధించడం, డిఎన్టి జాతీయ కమిషన్ ఏర్పాటు చేయడం, సంచార కులాలకు ప్రత్యేకమైన అట్రాసిటీ చట్టం ఇది సాధించడం కోసం నిరంతరం కృషి చేస్తానని ఈ లక్ష్యసాధనలో మీరందరూ సహకరించాలని కోరడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో సంచార కులాలకు ఎటువంటి ప్రాధాన్యత లేదని కుల వృత్తుల మీద ఆధారపడ్డ ఈ సంచార కులాలన్నీ కుల వృత్తులు అంతరించి పోయి వారి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని వాపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో బీసీలకు ఇస్తున్న లోన్లు కూడా బీసీల్లో ఉన్న అగ్రకులాలకు రాజకీయ అండదండలు ఉన్న కులాలకు మాత్రమే అవి చెందుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ
తక్షణమే ఎంబిసీ లోన్లు ఇచ్చి అత్యంత వెనకబడ్డ కులాల్ని కుల కార్పొరేషన్ లోన్లు ద్వారా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం చేశారు.





