న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి టౌన్, 07.03.2025: ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తిరుమలగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజీ అనంతారంలోని మోడల్ స్కూల్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష ను శుక్రవారం సందర్శించి పరీక్ష కేంద్రాలలో ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులకి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జాన్ మహ్మద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
5,976 Views




