న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట, 07.03.2025: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భాషా నాయక్ తండ సమీపంలో ఉన్న లయోలా పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయాలని పాఠశాల కరస్పాండెంట్ ఫాథర్ లూయి దాస్, ప్రిన్సిపాల్ ఫాదర్ సునీల్ లు కోరారు.

శుక్రవారం కమిటీ సభ్యులతో పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 1975-2025 పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఈ వేడుకలకు హాజరుకానున్నట్లు చెప్పారు. వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు సైతం జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. దాదాపు 3 వేల మంది పూర్వ విద్యార్థులు హాజరవుతున్నారని ఆ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

సమావేశంలో కోర్ కమిటీ ప్రెసిడెంట్ ఆకారపు రమేష్, వైస్ ప్రెసిడెంట్ పుట్ట కిషోర్, అడ్వైజరి కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాస్ రావు, గుర్రం సత్యనారాయణ రెడ్డి, దేవరశేట్టి జనార్దన్, రాచర్ల కమలాకర్, వజ్రయ్య, పూర్వ విద్యార్థులు సైధి రెడ్డి, మద్ది శ్రీనివాస్ యాదవ్, బూర శేఖర్, శ్రీధర్, ఆనంద్, వెంకట రెడ్డి, సైదులు తదితరులున్నారు.





