న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి టౌన్, 10.03.2025: మాల మహానాడు జాతీయ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కి విధేయులు రాహుల్ గాంధీ అత్యున్నత సన్నిహితుడు సామాజిక ఉద్యమ నేత మన ప్రియతమ నాయకులు అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఈరోజు నామినేషన్ వేసినందుకు తిరుమలగిరి మండల మాల మహానాడు తరపున మండల అధ్యక్షులు గంట సందీప్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పది సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఉన్నా ఎక్కడ వెనుకడుగు వేయకుండా ఏ మాత్రం భయపడకుండా తన సొంత ఆలోచనలతో గర్జించి సింహముల తన మాటలని 10 సంవత్సరాలు గర్జించాడు అన్నారు. అభయ హస్తంలో ఆలు పెరగని పోరాట యోధుడు ఆయనకు సాటి ఎవరూ లేరు చెప్పడానికి ఒక నిదర్శనం అన్నారు. ఒక రాజకీయ పదవిని పొందడం తెలంగాణ మాల మహానాడు ప్రజలకు చాలా గర్వకారణం అని అన్నారు.


