న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి టౌన్, 12.03.2025: తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎల్సొజు చామంతి నరేష్ లను వ్యవసాయ మార్కెట్ కమిషన్ ఖరీదారులు మరియు ఫార్ బాయిల్డ్ రైస్ మిల్లర్స్ యజమానులు. బుధవారం నాడు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ ఎల్సొజు చామంతి నరేష్ మాట్లాడుతూ వారికి శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వ్యాపారస్తులు వారి దృష్టికి తీసుకొచ్చిన పలు సమస్యలను సావధానంగా విని త్వరలోనే తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సామ ఆంజనేయులు శరీరాల సుధాకర్ దామెర ఉపేందర్ పాపక సోమేష్ పాలపు లక్ష్మయ్య తాటిశెట్టి రమేష్ ఉపేందర్ కమిషన్ తదిదారులు మరియు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.


