
న్యూస్ 24అవర్స్ టివి-పటాన్ చెరువు, 20.03.2025: తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం చారిత్రాత్మకమైన ఘట్టమని జిన్నారం కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా జిన్నారంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, హర్షం వ్యక్తం చేశారు. జిన్నారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్డె కృష్ణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ, అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా పాలనను ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. బీసీ సమాజానికి రాజకీయ, విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాలలో న్యాయం జరిగేలా బీసీ రిజర్వేషన్లు 42%కి పెంచడం, ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించడం ద్వారా యావత్ బహుజన సమాజానికి మేలు చేకూర్చిందన్నారు. ఇప్పటి వరకు బీసీ, ఎస్సీ వర్గాల హక్కులను కాపాడే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోని ప్రభుత్వాలతో పోల్చినప్పుడే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాలు ఎంత కీలకమో అర్థమవుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ. ఈ చారిత్రాత్మక నిర్ణయాల్లో ప్రత్యేక పాత్ర పోషించారని, ఈ నిర్ణయాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని, రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మాటలు కాదు, చేతల్లో చూపే పార్టీ అని మరోసారి నిరూపించుకుందని తెలిపారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్డే కృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు గౌడ్ ఎంపీ అశోక్ శ్రీనివాస్ రమేష్ యనగండ్ల నరేందర్ కొనింటి మహేష్ పట్నం శ్రీనివాస్ పుట్టి భాస్కర్ రమేష్ భవాని అశోక్ గణేశ్ ప్రవీణ్ కృష్ణ రెడ్డి పల్నాటి భాస్కర్ కోటేష్ వెంకటేష్ వీరేందర్ మల్లేష్ బాలేష్ శ్రీరాములు బిక్షపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




