
న్యూస్ 24అవర్స్ టివి-పటాన్ చెరువు, 23.03.2025: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగ యువత కొరకు చేపట్టిన రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అర్హులైన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని జిన్నారం మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని ఎస్సీ ఎస్టీ బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ పథకం ప్రారంభించారని, రాష్ట్రంలో 5 లక్షల మందికి రూ.6 వేల కోట్ల రాయితీ రుణాలు మంజూరు చేయనున్నారనిన్నారు. ఒక్కో లబ్ధిదారునికి 4 లక్షల వరకు రుణం మంజూరు చేయనున్నారు. 60 నుంచి 80 శాతం వరకు రాయితితో ఉంటుందని ఈ రుణాలు మంజూరు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఉద్యోగాలు కల్పిస్తున్న, కొంత యువత మాత్రం వారి కుటుంబ పరిస్థితులు బాలేకపోవడంతో చదువుకున్నప్పటికీ నిరుద్యోగులుగా మిగిలిపోయారు. వారి కోసమే రాజీవ్ యువ వికాసం పేరుతో రూ.6000 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలోని ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి అవకాశం కల్పించబోతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, దామోదర్ రాజనర్సింహ కి తెలంగాణ రాష్ట్ర యువత తరఫున వడ్డె కృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


