**సైకిల్ అందజేస్తున్న పాస్టర్ టి. కిరణ్ బాబు మరియు పాస్టర్స్…

న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్, 24.03.2025: శాంతినగర్ సూర్యాపేట బిషప్ దుర్గం ప్రభాకర్ నివాసం నందు ప్రేమ స్వరూపి మినిస్ట్రీ- హైదరాబాద్ వ్యవస్థాపకులు డా. పాల్ విశ్వనాధం బహుకరించిన సైకిల్ ను సువార్తికులు చిలుకూరి బాలరాజుకు సైకిల్ అందజేశారు. ఇటీవల కాలంలో సువార్తికులు చిలుకూరి బాలరాజు సైకిల్ పై సువార్త కు వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్లిన వ్యక్తినీ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చేర్పించగా రెండు రోజుల తరువాత చనిపోయినాడని మార్చిరిలోకి డాక్టర్స్ పంపించగ, డాక్టర్స్ పోస్ట్ మఠం చేస్తుండగా యేసుక్రీస్తు దయవలన తిరిగి లేచినడనీ,

గత 20 సంవత్సరాల నుండి సువార్త చేస్తున్న బాలరాజు సైకిల్ పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యి పాడై పోగ, సువార్త కు తిరగటానికి తీవ్ర ఇబ్బందిపడుతున్న విషయాన్ని హస్లా తండా గ్రామం పాస్టర్ రెవ టి. కిరణ్ బాబు, ఆత్మకూర్ (యస్) మండలం వారు డా. పాల్ విశ్వనాధం దృష్టి కి తీసుకెళ్లగా వారు రూ. 6,200 పెట్టి సైకిల్ కోని ఇచ్చి బాలరాజు బహుకరణ చేయమని పంపించగా సూర్యాపేట జిల్లా పాస్టర్స్ పెలోషిఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం ప్రభాకర్, సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్ ల చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవ. పి. వి. బోయాజ్, పాస్టర్ బాణాల సైమన్ తదితరులు పాల్గొన్నారు.




