న్యూస్ 24అవర్స్ టివి-స్టేట్ బ్యూరో చీఫ్, 26.03.2025: అఘోరీ గా చెలామణి అవుతున్న ఆ వ్యక్తి నా కూతురు కు మాయమాటలు చెప్పి తీసుకుపోయాడని, ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆ యువతి కుటుంబసభ్యులు మీడయాను ఆశ్రయించి ఆరోపించడాన్ని ఖండించిన మంగళగిరి పట్టణ సబ్ ఇన్స్ పెక్టర్ రవీందర్ నాయక్. ఈ విషయమై ఎస్సై న్యూస్ 24అవర్స్ టివి చానల్ ప్రతినిధి తో మాట్లాడుతూ ఆ యువతి తండ్రి ఫిర్యాదు మేరకు సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఆదేశానుసారం ఆ యువతిని పోలీస్ స్టేషన్ కు పిలించామన్నారు. ఆ యువతిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఆ యువతి మేజర్ అయినందున పోలీస్ స్టేషన్ కు వచ్చి వాంగ్మూలం ఇస్తూ నా ఇష్టపూర్వకంగానే వెళ్తున్నాను, ఇందులో ఎవరి ప్రమేయంలేదని, అఘోరీ మాత గా మారాలని నిర్ణయించుకొనే వెళ్ళానని ఆ యువతి చెప్పారని ఎస్సై వివరణ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే: గత కొంతకాలంగా లేడీ అఘోరీ గా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి తన కూతుర్ని మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి పోయాడని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెందిన తురిమెల్ల కోటయ్య నిన్న మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కూతురు ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తుందని. నాలుగు నెలల క్రితం లేడీ అఘోరి మంగళగిరి నేషనల్ హైవే మీద ఒంటి మీద బట్టలు లేకుండా హల్చల్ చేస్తుంటే పోలీస్ వారు ఎవరైనా మహిళలు ఉంటే కొంచెం లేడి అఘోరికి బట్టలు కప్పండి అని చెప్పిన తర్వాత తమ కూతురు ధైర్యంతో వెళ్లి బట్టలు కప్పిందని, అప్పటి నుంచి నా కూతురు ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడటం జరుగుతుందని. కొంతకాలం గడిచిన తర్వాత మా ఇంటికి కూడా వచ్చి నా కూతుర్ని మాయ మాటలతో మోసం చేసి ఆకుపసరు తో లేపనాలు పూసి, వశీకరణ చేసుకొని అఘోరీల ఆశ్రమానికి యువరాణి ని చేస్తారని చెప్పి తన కూతుర్ని పూర్తిగా తనవైపు తిప్పుకున్నాడని వాపొయ్యాడు.




