
-సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న జెనీలియా
-మే 1 న రాజా శివాజీతో రాక
-పిల్లల కోసం పెట్టిన రూల్ ఏంటి
భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న క్యూట్ అండ్ ది బెస్ట్ కపుల్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న రితీష్ దేశేముఖ్(రితీష్ దేశ్ ముఖ్), జెనిలియా(జెనీలియా)మే 1 న ‘రాజాశివాజీ'(రాజా శివాజీ)తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్లలో అడుగుపెట్టనున్నారు. శివాజీగా రితీష్ దేశ్ ముఖ్, ఆయన భార్య ‘సాయిబాయ్’ గా జెనీలియానే చేస్తుంది. తమ శక్తికి మించి రాజా శివాజీని ప్రదర్శించారు. ఈ విషయంపై రీసెంట్ గా జరిగిన ‘రాజా శివాజీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆ ఇద్దరు పెట్టిన కన్నీరే సాక్ష్యం. అభిమానులు కూడా ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఇప్పుడు ఆ అందర్నీ హుషారు మోడ్ లోకి తీసుకొచ్చే బాధ్యతని జెనీలియా తీసుకొచ్చింది. ఆ డీటెయిల్స్ చూద్దాం.
రీసెంట్ గా జెనీలియా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు మాంసాహారాన్ని ఇష్టపడేవాళ్ళం. కానీ ఇప్పుడు పూర్తి శాఖాహారులుగా మారాం. రితేష్ 2016లో మాంసాహారం మానేయగా, నేను వన్ ఇయర్ తర్వాత మానేసాను. నేను ఒక క్యాథలిక్ కుటుంబంలో పెరిగాను, మా ఇంట్లో నాన్-వెజ్ తప్పనిసరి. కానీ రితేష్ నిర్ణయం తర్వాత నేను కూడా మారాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు శాఖాహారం వల్ల మా ఆరోగ్యం చాలా మెరుగుపడింది, మేం చాలా ఉత్సాహంగా ఉంటున్నాం. పిల్లల పెంపకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. ముఖ్యంగా పిల్లలకి భారతీయ సినిమా గొప్పతనాన్ని తెలియజేయడానికి రితేష్ ఒక రూల్ పెట్టాడు. ప్రతి వారం ఒక ఐకానిక్ హిందీ సినిమా పిల్లలతో కలిసి తప్పకుండా చూస్తాం.
ఇది కూడా చదవండి: chandrababu Naidu: వెండి తెరపై చంద్రబాబు నాయుడు బయోపిక్.. దర్శకుడు ఎవరో తెలిస్తే హ్యాపీగా ఫీలవుతారు
వాళ్ళకి సినిమాల పట్ల గౌరవం, భాషపై పట్టు పెంచడమే ఆ రూల్ ఉద్దేశం. అయితే, పిల్లల కంటే రితేశే ఎక్కువగా లీనమైపోతారు. సినిమా రిలీజ్ సమయంలో ఉండే టెన్షన్ విషయంలో రితేశ్కి ఒత్తిడి ఎక్కువైతే హాయిగా నిద్రపోతాడు. తను కంగారు పడితే నేను ధైర్యం చెబుతాను, ఒక వేళ నేను టెన్షన్ పడితే తను నాకు ఉంటాడని జెనీలియా చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ మాటలు ఆ ఇద్దరి అన్యోన్య దాంపత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఇక రాజా శివాజీ మరాఠా యోధుడు హిందువుల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు.




