
-ఏడు దశాబ్దాల క్రితమే చైనాలో రికార్డు సృష్టించిన ఎన్టీఆర్
-బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ రికార్డ్స్ కూడా చాలవు
-ఇంతకీ ఆ చిత్రం ఏది
ప్రస్తుతం తెలుగు సినిమా వరల్డ్ వైడ్ గా తన హవా చాలా బలంగా చాటుతుంది . ‘బాహుబలి’, ‘RRR’ వంటి చిత్రాలు చైనా, జపాన్ వంటి దేశాల్లో వందల కోట్ల వసూళ్లు సాధించడం మనం చూస్తున్నాం. అయితే, మన గ్లోబల్ మార్కెట్ ప్రయాణం ఇప్పుడే మొదలైందని అనుకుంటే పొరపాటే. దాదాపు ఏడు దశాబ్దాల క్రితమే మన తెలుగు సినిమా చైనా గడ్డపై అడుగుపెట్టి రికార్డు సృష్టించింది. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్)అందుకు ఆద్యుడిగా నిలిచారు.
మల్లీశ్వరి.. ఎన్టీఆర్, భానుమతి(భానుమతి)జంటగా చేసిన అపురూప దృశ్య కావ్యం. ఈ చిత్రమే చైనాలో సబ్టైటిల్తో విడుదలై 100 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా అంతర్జాతీయ రికార్డు నెలకొల్పింది. దీన్ని బట్టి చైనా ప్రేక్షకులు మల్లీశ్వరి ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. రష్యాలోని మాస్కోలో కూడా ప్రదర్శించి రికార్డు సృష్టించింది. 1953లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్తో పాటు పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శితమై అనేక మంది విదేశీయుల ప్రశంసలు సైతం అందుకుంది.
ఇది కూడా చదవండి: NBK111 లో బాలయ్య హిట్ హీరోయిన్!. ఫ్యాన్స్ ఖుషి
విదేశాల్లో కూడా మల్లీశ్వరి చిత్రం అంతగా ఆదరణ పొందటానికి గల కారణాలు ఎన్నో. సృజనాత్మకతతో కూడిన కథ, కథనం,అద్భుతమైన మాటలు, పాటలు, ఎన్టీఆర్, భానుమతి గార్ల నటన, దర్శక బ్రహ్మ బిఎన్ రెడ్డి(బిఎన్ రెడ్డి)గారు తెరకెక్కించిన విధానం.. ఇలా ఎన్నో అంశాలు మల్లీశ్వరిని ఖండాంతరాల ప్రేక్షకుల మనస్సులో చిరంజీవిగా నిలిచిపోయేలా చేసాయి. తెలుగు నాట కూడా ఎన్నో కేంద్రాలలో శతదినోత్సవాన్ని జరుపుకుంది. 1951 డిసెంబర్ 20 రిలీజ్ డేట్ .





