[ad_1]

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (ఎన్టీఆర్) కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన కట్ అవుట్. అభిమాన గణం కూడా ఎక్కువ. పైగా వీరి అభిమానుల సంఘాలు నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే కొంతమంది కేటుగాళ్లు ఎన్టీఆర్ పేరుతో అనధికారికంగా విరాళాలు సేకరిస్తూ సామాన్యులని ,అభిమానులని మోసం చేస్తున్నారు. దీంతో ‘ఎన్టీఆర్ ఆఫీస్’ (ఎన్టీఆర్ ఆఫీస్) సూచనతో ఒక కీలక అధికారిక ప్రకటన విడుదలైంది.
గతంలో సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలనో, లేక సేవా కార్యక్రమాల పేరుతో కొంతమంది వ్యక్తులు క్యూఆర్ కోడ్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలు షేర్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులు,ట్విట్టర్ వేదికగా ఈ తరహా ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్ పెరిగిపోయాయి. ఇవి పూర్తిగా అనధికారికమని మరియు వీటికి ఎన్టీఆర్ గారికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే ఎన్టీఆర్ పేరు మీద ఎలాంటి విరాళాలు ముందస్తుగా సేకరించాలన్నా, కార్యక్రమాలు నిర్వహించాలన్నా ఎన్టీఆర్ ఆఫీస్ అనుమతి తప్పనిసరి.
ఎవరైనా వ్యక్తిగతంగా గానీ, సంస్థల పేరుతో గానీ విరాళాలు అడిగితే స్పందించవద్దు. అలాంటి వారిని ప్రోత్సహించవద్దు. ఎన్టీఆర్ పేరును దుర్వినియోగం చేస్తూ డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇది కూడా చదవండి: VeeraBhadrudu: వీరభద్రుడు థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ ఆందోళన.. మార్నింగ్ షో క్యాన్సిల్
ఎన్టీఆర్ ఆఫీస్ తీసుకున్న ఈ నిర్ణయం అటు అభిమానులను, ఇటు సామాన్య ప్రజలను మోసగాళ్ల భారీ నుండి కాపాడేందుకు ఎంతో దోహదపడుతుంది. సెలబ్రిటీల పేరుతో జరిగే ఇలాంటి స్కామ్ల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఇలాంటి అక్రమ వసూళ్లకు ఎవరైనా సమాచారం ఇస్తే వెంటనే పోలీసులకు లేదా ఎన్టీఆర్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అందించడం ఉత్తమం.

[ad_2]




