
నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు పర్ఫెక్ట్ పాన్ ఇండియా కట్ అవుట్. ‘కార్తికేయ 2’తో ఘనత సాధించి ఇప్పుడు ‘స్వయంభూ’తో ముస్తాబవుతున్నాడు. ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు ఒక రేంజ్ లో ఉన్న అభిమానులతో, ప్రేక్షకులు స్వయంభు రాక కోసం ఎంతో ఆసక్తితో ఉన్నారు.
తాజాగా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కంప్యూటర్ గ్రాఫిక్స్ (CG) పరంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కళ్ళు చెదిరే సరికొత్త రికార్డుని క్రియేట్ చేసిన చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి అత్యున్నత గ్రాఫిక్స్ చిత్రాలు ‘స్వయంభూ’గా నిలిచాయి. ఒక మీడియం రేంజ్ హీరో ఆ స్థాయి భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతికతని ఉపయోగించడం టాలీవుడ్లోనే ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఈ భారీ చారిత్రక కథాంశంలో ఏకంగా 2,700కు పైగా హై-క్వాలిటీ వీఎఫ్ఎక్స్ (VFX) షాట్లు ఉండబోతున్నాయని సరికొత్త అప్డేట్ ద్వారా వెల్లడైంది. స్క్రీన్పై హాలీవుడ్ స్థాయి విజువల్స్ని ప్రేక్షకులకు అందించడమే ధ్యేయంగా మేకర్స్ ఏమాత్రం రాజీ పడకుండా ఈ గ్రాఫిక్స్ పనులను ప్లాన్ చేస్తున్నారు.
ఈ అద్భుతమైన విజువల్ మ్యాజిక్ని సాకారం చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన టాప్ వీఎఫ్ఎక్స్ స్టూడియోలకి (ఫాంటమ్ వీఎఫ్ఎక్స్ పబ్లిక్) దాదాపు 750 మందికి పైగా సీజీ (CG) ఆర్టిస్టులు మరియు నిపుణులు శ్రమిస్తున్నారు. కేవలం గ్రాఫిక్స్ నాణ్యత విషయంలో తగ్గకూడదనే ఉద్దేశ్యంతోనే చిత్రబృందం రాత్రింబవళ్లు నాన్ స్టాప్గా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తోంది. సినిమా విడుదలను తొందరపడి ప్రకటించడం కంటే, ప్రేక్షకుడికి ఒక మైండ్ బ్లోయింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి పట్టుదలతో నిఖిల్ స్వయంగా ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.
ఇటీవలే హీరో నిఖిల్ సిద్ధార్థ్, ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన లెజెండరీ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్తో కలిసి ప్రత్యేకంగా వీఎఫ్ఎక్స్ స్టూడియోలను సందర్శించి గ్రాఫిక్స్ ఫుటేజీని పరిశీలించారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా 8 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించడం విశేషం. వియత్నాం ఫైటర్లతో కూడిన ఈ భారీ యుద్ధ సన్నివేశాలను దాదాపు 700 మంది ఆర్టిస్టులతో 12 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించారు. పురాతన సామ్రాజ్యాల సెట్స్, రోమాంచితమైన యుద్ధ సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Puri Jagannadh: వాళ్ళని ఎవరు ఓడించలేరు.. పూరి జగన్నాధ్ ఆ హీరోల గురించి భలే చెప్పాడు
లెజెండరీ యోధుడి జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్, నభా నటేష్ కథానాయికలుగా చేస్తున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా కోసం నిఖిల్ ప్రత్యేకంగా గుర్రపు స్వారీ, కత్తి సాము మరియు మార్షల్ ఆర్ట్స్ వంటి ప్రాచీన యుద్ధ విద్యలలో కఠినమైన శిక్షణ కూడా తీసుకున్నారు. అన్ని క్వాలిటీ చెక్లు పూర్తి చేసుకుని ఈ ఏడాది చివర్లో ప్రపంచ థియేటర్లలో భారీ స్థాయిలో విడుదలైంది.భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో, పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై భువన్, శ్రీకర్, ఠాగూర్ మధు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.




