[ad_1]

‘ధురంధర్'(ధురంధర్)రెండు భాగాలు సాధించిన విజయం .ఇండియన్ చిత్రసీమలోనే రికార్డు కలెక్షన్స్ ని సాధించి ప్రస్తుతం ఓటిటి వేదికగా కూడా తన సత్తా చాటుతుంది. , . ఇంతటి ఘన విజయాన్ని అందుకున్న ధురంధర్ కి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే కథకి సంబంధించిన కాపీరైట్ వివాదం, దేశ భద్రతకు సంబంధించిన కోర్టు కేసులతో వార్తల్లో నిలవగా తాజాగా మరో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
రెండు భాగాలకు ప్రొడక్షన్ డిజైన్గా వ్యవహరించిన సైనీ ఎస్. జోహ్రేపై వేధింపుల ఆరోపణలు రావడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండు భాగాలకు పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ అయిన ఒక యువతీ ,సైనీపై పోలీసులకి ఫిర్యాదు చేస్తూ గత ఏడాది సెప్టెంబర్ 10 న చండీగఢ్లోని ఒక హోటల్ కి రావాలని చెప్తే వెళ్ళాక నాతో అసభ్యంగా ప్రవర్తించాడని, నేను అనారోగ్యంతో ఉన్నా సరే అక్కడ నుంచి వెళ్లనివ్వలేదని , ఎవరికైనా చెబితే కెరీర్ దెబ్బతింటుందని బెదిరించాడని తన ఫిర్యాదులో విచారణ జరిపిన బాధిత ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.
3000 కోట్లు వసూలు చేసిన ఒక బడా ప్రాజెక్టు వెనుక ఇంతటి చీకటి కోణాలు ఉండటం వలన సగటు సినిమా అభిమానులని విస్మయానికి గురిచేస్తోంది. బాధితురాలికి న్యాయం జరగాలని, ఇండస్ట్రీలో ఇలాంటి వేధింపులకు చెక్ పెట్టాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంపై చిత్ర యూనిట్ లేదా ప్రొడక్షన్ డివైడ్ సాయినీ ఎస్. జోహ్రే ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అని ఇటు బాలీవుడ్, అటు టాలీవుడ్ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
[ad_2]




