[ad_1]

రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్(దేవి శ్రీ ప్రసాద్) హీరోగా ఎల్లమ్మ(యెల్లమ్మ)అనే చిత్రంతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణం ఈ చిత్రం బలగం ఫేమ్ వేణు దర్శకుడు కావడం దేవి శ్రీప్రసాద్ కి సంబంధించిన లుక్ తో ఎల్లమ్మ రాక కోసం ఎంతో ఆసక్తితో రూపొందించారు. రీసెంట్ గా మరో రాక్ స్టార్ తమన్ ఎల్లమ్మ గురించి చేసిన వ్యాఖ్యలు ఎల్లమ్మ పై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ మాట్లాడుతూ ఎల్లమ్మ కథ నాకు మొదటి నుంచి పూర్తిగా తెలుసు. కథ విన్నప్పుడే చాలా అద్భుతంగా అనిపించింది. ఈ తరహా కథాంశాలు టాలీవుడ్లో చాలా అరుదుగా వస్తాయి. ఒక వైపు టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటూనే, నటుడిగా దేవిశ్రీ 100 శాతం ప్రాణం పెట్టి మారుతున్నారు. ఆయన పడుతున్న కష్టం, డెడికేషన్ కచ్చితంగా వెండితెరపై భారీ స్థాయిలో ప్రతిబింబిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ యాక్టింగ్ కెరీర్కి ఎల్లమ్మ ఒక మైలురాయిగా నిలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ‘పర్షి’ అనే డప్పు కళాకారుడి క్యారక్టర్ లో ఊరమాస్ లుక్లో కనిపించబోతున్నారు.
ఇది కూడా చదవండి: పెద్ది: పెద్ది ఊహించని షాక్.. అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కులసంఘాల డిమాండ్
‘ఎల్లమ్మకి నేనే మ్యూజిక్ ని అందించాను’. సినిమాలోని కొన్ని ప్రత్యేకమైన పాటల కోసం నన్ను అడిగారు. దేవిశ్రీ ప్రసాద్ కోసం తప్పకుండా అద్భుతమైన ట్యూన్స్ ఇస్తానని ఒప్పుకున్నట్లు తమన్ స్పష్టం చేశారు. ఒక హీరోగా మారుతున్న తోటి మ్యూజిక్ డైరెక్టర్ మరొక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అందించడం అనేది టాలీవుడ్ చరిత్రలోనే ఒక అరుదైన మరియు బ్యూటీఫుల్ మూమెంట్ అని చెప్పాలి. ఈ క్రేజీ కాంబినేషన్ మరియు తమన్ ఇచ్చిన పాజిటివ్ స్టేట్మెంట్స్ చూస్తుంటే ‘ఎల్లమ్మ’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.
[ad_2]




