
ప్రముఖ ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియో తన ప్రతిష్టాత్మక తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ఇసాకపట్నం’ (ఇసకపట్నం) స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఏడు ఎపిసోడ్ల యాక్షన్ థ్రిల్లర్ జూలై 2 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ వీడియో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రతీకారం, అధికారం, కుటుంబ రాజకీయాలు, గ్యాంగ్ వార్స్ ఆధారంగా రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్కు ప్రశాంత్ రాఘతి కథ అందించబడింది, తాజుద్దీన్ సయ్యద్ సంభాషణలు రాశారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్పై రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు.
ఒక కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగే ‘ఇసాకపట్నం’ కథలో అధికారం కోసం జరిగే పోరాటాలు, కుటుంబ విభేదాలు, రాజకీయ కుట్రలు, గ్యాంగ్స్టర్ సంఘర్షణలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించారు, సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్కనకాల, మైమ్ గోపి, రోహిణి, బెనర్జీ, జ్వాలా కోటి, రవివర్మ, రాజాచెంబోలు కీలక పాత్రలు పోషించారు.
ఈ సందర్భంగా ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజినల్ హెడ్ నిఖిల్మాధోక్ మాట్లాడుతూ, “దక్షిణ భారతీయ కథలతో ఇప్పటికే విభిన్నమైన ఒరిజినల్కు ప్రేక్షకులు అందిస్తున్నారు. ఇప్పుడు’ఇసాకపట్నం’ ద్వారా మరొక శక్తివంతమైన కథను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నారు. బలం చేకూర్చాయి” అనితెలిపారు.
నిర్మాతలు రాహుల్ తమడా, సందీప్ రెడ్డి బొర్రా మాట్లాడుతూ, “ఇసాకపట్నం ఒక రివెంజ్ థ్రిల్లర్ మాత్రమే కాదు. వ్యక్తిగత నష్టం, విశ్వాసం, కుటుంబ విభేదాలు, రాజకీయ ఆధిపత్య పోరాటం వంటి అంశాలు భావోద్వేగంగా మిళితం చేసిన కథ ఇది.
తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో డబ్బింగ్ వెర్షన్, అలాగే ఇంగ్లీష్ సహా 15 భాషల్లో సబ్టైటిల్స్తో ‘ఇసాకపట్నం’ జూలై 2 నుంచి అందుబాటులోకి రానుంది.




