చిత్ర పరిశ్రమలో గ్లామర్ ప్రపంచం ఎంత కలర్ఫుల్గా ఉంటుందో, దాని వెనుక ఉంటే చీకటి కోణాలు కూడా అంతే షాకింగ్గా ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిన తర్వాత సెలబ్రిటీలపై ట్రోలింగ్ చేయడం సర్వసాధారణంగా మారింది. అయితే తాజాగా టాలీవుడ్ బుట్టబొమ్మ, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తనకు ఎదురైన నెగెటివ్ పీఆర్, సోషల్ మీడియా ట్రోల్స్ వెనుక ఉన్న ఒక నమ్మలేని నిజంపై నోరు విప్పారు. తనపై జరుగుతున్న వరుస దాడులు యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావని, కావాలనే డబ్బులిచ్చి చేయిస్తున్న పక్కా ప్లాన్ అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ.. పబ్లిక్ రిలేషన్స్ మేనేజ్మెంట్లో తాను చాలా బలహీనమని అంగీకరించారు. గతంలో సోషల్ మీడియాలోని కొన్ని మీ పేజీలు తనను నిరంతరం టార్గెట్ చేస్తూ, కేవలం నెగెటివ్ కంటెంట్ను మాత్రమే ప్రచారం చేయడం జరిగిందని చెప్పారు. మొదట్లో దీన్ని లైట్ తీసుకున్నప్పటికీ.. రోజురోజుకూ హద్దులు దాటిపోవడంతో, అసలు తనపైనే ఎందుకు ఇంతలా విషప్రచారం జరుగుతోందనే విషయంపై నిఘా పెట్టాల్సిందిగా తన టీమ్ను కోరినట్లు.
ఆ సమయంలో బయటపడిన నిజాలు పూజ హెగ్డేతో పాటు ఆమె కుటుంబ సభ్యులను సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. కొంతమంది వ్యక్తులను మానసికంగా దెబ్బతీయడానికి, ఇండస్ట్రీలో తన ఇమేజ్ని తగ్గించడానికి లక్షల రూపాయల డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతున్నారని ఆమె తెలుసుకున్నారు. పాపులర్ మీ పేజీలను కాంటాక్ట్ చేసినప్పుడు.. ఒక పెద్ద నెట్వర్క్ దీని వెనుక ఉందని, తనపై నెగెటివిటీని స్ప్రెడ్ చేయడానికి వాళ్లకు భారీగా అమౌంట్ అని నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు.
అంతేకాదు, ఒకవేళ ఆ నెగెటివ్ పోస్టును ఆపించాలన్నా.. లేదా ఇతరులపై రివర్స్ ట్రోలింగ్ చేయాలన్నా వారికి కూడా ఇంత మొత్తం చెల్లించాలంటూ మీమ్స్ నిర్వాహకులు ఆఫర్ ఇచ్చారని పూజ పేర్కొన్నారు. ఈ విధమైన సైబర్నింగ్ చూసి తాను షాక్ అయ్యానని, సాధారణ నెటిజన్లు నిజనిజాలు తెలియక ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్ముతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన కామెంట్స్ బాక్సుల్లో కనిపించే అత్యంత ఘోరమైన విమర్శలన్నీ డీపీ, పోస్టులు లేని పేయిడ్ బాట్ల ద్వారా సృష్టించబడుతున్నవేనని ఆమె వివరించారు.
అయితే, తనను కిందకు లాగాలని చూస్తున్నారంటే తాను చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నానని అర్థమని, అందుకే ఒక కాంప్లిమెంట్గా కోరుకుంటున్నానని ఈ బ్యూటీ ధీటుగా బదులిచ్చారు. థియేటర్లలో సామాన్య ప్రేక్షకులు చూపించే ఆదరణ, ఎయిర్పోర్టుల్లో అభిమానులు అడిగే సెల్ఫీలే తనకు నిజమైన విజయమని నమ్ముతున్నట్లు చెప్పారు. పూజా హెగ్డే చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. హీరోయిన్లను తొక్కేయడానికి ఇండస్ట్రీలోనే ఇలాంటి నెగెటివ్ గ్రూపులు ఉన్నాయా అంటూ నెటిజన్లు సైతం చర్చించుకుంటున్నారు.




