[ad_1]

-కోలీవుడ్ తో పాటు ఇండియన్ చిత్ర సీమలో సంచలనం
-విజయ్, త్రిష బ్రేక్ అప్ అయినట్టేనా!
-ఆ ఒక్క నిర్ణయంతో త్రిష బ్రేక్ అప్ విషయాన్నీ చెప్పిందా!
సౌత్ ఇండస్ట్రీతో పాటు యావత్తు భారతీయ చలన చిత్ర సీమ, అభిమానుల్లో ఒక సెన్సేషనల్ న్యూస్ సంచలనం సృష్టిస్తుంది. నిన్న సీఎం విజయ్(VIjay)ఉరఫ్ ఇళయ దళపతి విజయ్ తన 52వ పుట్టినరోజుని జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, లక్షలాది మంది అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఏటా విజయ్ బర్త్ డే రోజున ప్రత్యేకంగా విష్ చేసే అలవాటున్న త్రిష(త్రిష)ఈసారి మాత్రం సోషల్ మీడియాలో కనీసం ఒక్క పోస్ట్ కూడా చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. గతంలో పుట్టిన రోజు నాడు విజయ్తో దిగిన అన్సీన్ ఫోటోలని పంచుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపే త్రిష, ఈ 52వ పుట్టినరోజున పూర్తిగా మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈ బ్రేకప్ రూమర్లకి మరింత బలం చేకూరుస్తూ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో విజయ్ని అన్ఫాలో చేయడం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఎంతో కాలంగా కొనసాగుతున్న వీరి సుదీర్ఘ స్నేహం లేదా రిలేషన్ త్రిష ఈ విధంగా అన్ఫాలో చేయడం ద్వారా ఒక స్పష్టమైన ముగింపు పలికిందని నెటిజన్లు అందజేసారు. విజయ్ తమిళనాడు సీఎం అయిన తర్వాత రాజకీయ ప్రతిష్టని దృష్టిలో ఉంచుకుని త్రిషని దూరం పెట్టారని, అందుకే ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకుందని మరికొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. తమిళ సర్కిల్స్ లో విజయ్ తన భార్య సంగీతంతో ఉన్న విభేదాలను పక్కనబెట్టి మళ్లీ కలవబోతున్నారనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది.
కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫెయిర్స్ లో విజయ్, త్రిష కృష్ణన్ ఒకరు. వీరిద్దరి ఆన్స్క్రీన్ కెమిస్ట్రీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. గిల్లి, తిరుపాచి, ఆతి, కురువి, లియో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలే ఒక ఉదాహరణ.
[ad_2]




