[ad_1]

వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద సమంత కట్ అవుట్ కి ఉన్న కెపాసిటీ మా ఇంటి బంగారంతో మరో సారి రుజవయ్యింది. జూన్ 19న విడుదలవ్వగా వన్ వీక్ పూర్తి కాకుండానే 50 కోట్ల క్లబ్లోకి చేరింది. కానీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నప్పటికీ, కంటెంట్ పరంగా మాత్రం సినిమా చూసిన ప్రేక్షకులు, సినీ విశ్లేషకుల నుంచి కొంచం వ్యతిరేకత వస్తుంది.
మూవీ సెకండ్ హాఫ్ మాత్రం అసలు బాగాలేదని కొంత మంది ప్రేక్షకులు అంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఇదే చర్చ నడుస్తుంది.స్వర్ణ అలియాస్ ఝాన్సీ అనే పవర్ ఫుల్ రోల్ లో సమంత వన్ మాన్ షోగా నిలిచిపోయింది, ఫ్యామిలీ ఎమోషన్స్, రాండ్ రాక్ యాక్షన్ సీన్స్ లో తన అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించి తన భుజాలపై మోసం చేసింది. అయితే, ఒకప్పుడు తన కళ్ళతోనే మ్యాజిక్ చేస్తే సమంత మార్క్ ఇందులో పెద్దగా కనిపించలేదని ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు.
ఇది కూడా చదవండి: సంక్రాంతికి తమిళ అగ్ర హీరోలు, తెలుగు అగ్ర హీరోల మధ్య పోటీ.. మీరు ఎవరి పక్కనా!
వాళ్లంతా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతు ;అసలు సమస్య కథలో కాకుండా, నందిని రెడ్డి రాసుకున్న స్క్రీన్ ప్లే లోనే ఉన్న ఫ్యామిలీ డ్రామా,కామెడీ ఎంటర్టైనర్గా చాలా పాజిటివ్గా మొదలైన మొదటి భాగం, సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ గా మారే అవకాశం పూర్తిగా కోల్పోయింది. ముఖ్యంగా కథనంలో వేగం లోపించడం, బలహీనమైన స్క్రీన్ ప్లే ప్రేక్షకులు కొంచం విసుగుని తెప్పించాయి. విలన్ రోల్ ఉత్కంఠని రేకెత్తించాల్సింది పోయి చాలా పేలవంగా సాగుతుంది. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఓ ప్రకాష్ సినిమాటోగ్రఫీ కూడా కీలకమైన యాక్షన్ సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి. ప్రమోషన్లతో ఎంత హైప్ తెచ్చినా, థియేటర్లలో కాంపిటీషన్ లో వేరే సినిమాలు రావడం వల్ల కలెక్షన్స్ బానే వస్తున్నాయి కానీ, కంటెంట్ విషయంలో పెద్దగా వెలితి కనిపిస్తోందని అంటున్నారు.
[ad_2]




