న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి రూరల్, 13.03.2025: మత్తు పదార్థాలకు యువత బానిస కావద్దని సాంస్కృతిక సారధి జిల్లా టీం లీడర్ పాలకుర్తి శ్రీకాంత్ అన్నారు. గురువారం మండలంలోని రాజా నాయక్ తండాలో కళాజాతతో కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యపురిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ అధికారుల ఆదేశాల మేరకు కళాజాతల ద్వారా మత్తు పదార్థాల పైన ప్రజలను చైతన్య పరచడానికి గ్రామాలలో ప్రదర్శనలు ఇస్తున్నామని చెప్పారు. యువత గంజాయి డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు మత్తుకు బానిసలు కవద్దని భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని చెప్పారు. పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి కొణిదల కిరణ్. సాంస్కృతిక సారధి కళాబృందం సభ్యులు. ఈర్ల సైదులు. గడ్డం ఉదయ్. వెన్నెల నాగరాజు. మాగి శంకర్. పాక ఉపేందర్. మేడిపల్లి వేణు. మద్దిరాల మంజుల. సిరిపంగి రాధ. నెమ్మాది స్రవంతి. పోతరాజు శిరీష. గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


